- డివిజన్కో పోలింగ్ సెంటర్ లెక్కన 150 చోట్ల అమలు
- గతంలో యాప్లో పలు టెక్నికల్ సమస్యలు
- పక్కాగా ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుందన్న ఎలక్షన్ కమిషన్
- యాప్ వినియోగానికి అభ్యంతరం చెప్పిన మజ్లిస్
హైదరాబాద్, వెలుగు: దొంగ ఓట్ల సమస్యకు చెక్పెట్టేలా ఓటర్ల ఫేస్రికగ్నైజేషన్ యాప్ను వినియోగించేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో ఒక్కో పోలింగ్ స్టేషన్ లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఓటర్లు వెంట తెచ్చే ఐడెంటెటీ కార్డులతో సంబంధం లేకుండా యాప్ సాయంతో వారిని ఈజీగా గుర్తించవచ్చు. దీనిలో భాగంగా యాప్ సాయంతో ఓటర్ ఫేస్ను ఫొటో తీస్తారు. యాప్ ఈ ఫొటోను ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లోని సదరు ఓటరు ఫొటోతో సరిపోల్చి రిజల్ట్ ఇస్తుంది. పది సెకన్లలోనే రిజల్ట్ వస్తుందని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది.
దొంగ ఓట్లు పడకుండా..
ఇటీవలి మున్సిపల్ ఎలక్షన్ల సమయంలో మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీలో ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను ప్రయోగాత్మకంగా వాడారు. అప్పుడు పలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పోలింగ్ లేటవుతోందని కొందరు ఓటర్లకే దానిని పరిమితం చేశారు. ఈసారి అట్లాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈసీ అధికారులు చెప్తున్నారు. ఈ యాప్తో ఓటర్లను త్వరగా గుర్తించి, రియల్టైం అథెంటికేషన్ పొందవచ్చని అంటున్నారు. ఎవరైనా ఇతరుల పేరిట ఓట్లు వేయకుండా, దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
ఆ ఫోటోలు భద్రపర్చం: ఈసీ
ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా తీసే ఓటర్ల ఫొటోలను భద్రపర్చబోమని, అథెంటికేషన్ పూర్తవగానే డిలీట్ చేస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ యాప్వినియోగానికి సంబంధించి… ఒక పోలింగ్ అధికారి ఓటరు ఐడీని చెక్ చేస్తారు. తర్వాత ఓటరు ఫోటో తీసి.. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ సాయంతో స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సర్వర్ కు అప్లోడ్ చేస్తారు. ఆ సర్వర్ సెర్చ్ చేసి వచ్చిన ఓటర్ సదరు వ్యక్తి అవునా, కాదా? ఇంతకు ముందు ఓటు వేశాడా లేదా అన్న సమాచారాన్ని ఇస్తుంది. ఈ రిజల్ట్ రాగానే సదరు ఓటరును ఓటు వేయడానికి అర్హుడా, కాదా
నిర్ణయిస్తారు.