హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ పరిశీలన కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్రం కోరింది. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్కుమార్కు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్రజత్కుమార్మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. డీపీఆర్పరిశీలన కొనసాగించి త్వరగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
పొలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీలకు బదులుగా ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా నికర జలాలు ఉపయోగించుకోవచ్చని బ్రజేశ్ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) తీర్పులో స్పష్టం చేశారన్నారు. ఇందులో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కుతాయని, మైనర్ఇరిగేషన్కేటాయింపుల్లో తాము ఉపయోగించుకోలేకపోతున్న ఇంకో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలతో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు.
ఈ కేటాయింపులు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్తూ సీడబ్ల్యూసీ డీపీఆర్ను పరిశీలించకుండా వెనక్కి పంపడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 1,200 గ్రామాలు, 12.30 లక్షల ఎకరాలకు తాగు, సాగునీటిని అందించే పాలమూరుకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. 2021 జులై 15న కేంద్రం విడుదల చేసిన కేఆర్ఎంబీ గెజిట్ ప్రకారం డీపీఆర్ పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు.