చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్

చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్

హైదరాబాద్ అమీన్‌పూర్ పరిధిలోని ప్రణీత్ ప్రణవ్ గేటెడ్ కమ్యూనిటీలో హల్ చల్ చేసిన  చెడ్డీ గ్యాంగ్ ను గుర్తించామని మాదాపూర్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లే వీళ్ల టార్గెట్ అని చెప్పారు. ఈ చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ లోని ఇళ్లల్లో మొత్తం 30 తులాల బంగారం దోచుకెళ్లారని వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ లోని నలుగురు సభ్యులను పట్టుకున్నామని.. వీరు గుజరాత్ లోని దాహోడ్ ప్రాంతం వారిగా గుర్తించామన్నారు డీసీపీ. గతంలో గుజరాత్ ఏరియాలో కూడా వీరు దొంగ తనాలకు పాల్పడ్డారని వివరించారు. 

చెడ్డీ గ్యాంగ్ దొంగతనం చేసే రెండు రోజుల ముందు హైదరాబాద్ కు వస్తారని.. ఆ తర్వాత మళ్లీ గుజరాత్ కు వెళ్ళిపోతారని డీసీపీ సందీప్ రావు తెలిపారు. వీరు చేతిలో రాడ్డు, రాళ్లు పట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరు అనుకున్న పని వారం రోజుల్లో పూర్తి చేసుకుని వెళ్లేలా ప్లాన్ చేస్తారని వివరించారు. చెడ్డీ గ్యాంగ్ వెనక ఉన్న వ్యక్తుల గురించి కూడా ఆరా తీస్తున్నామన్నారు డీసీపీ సందీప్ రావు.