గంగరమంద పొలాల్లో చిరుత పిల్లలు ఆందోళనలో గ్రామస్తులు

గంగరమంద పొలాల్లో చిరుత పిల్లలు  ఆందోళనలో గ్రామస్తులు

మాక్లూర్, వెలుగు: నిజామాబాద్​జిల్లా మాక్లూర్​మండలంలోని గంగరమంద వరి పొలాల్లో  రెండు చిరుతపులి  పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం  పొలాల్లోకి వెళ్లిన రైతులకు చిరుత పిల్లలు కనిపించడంతో సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. వీడియోలను సోషల్​ మీడియాలో అప్​లోడ్​చేయడంతో వైరల్​అయ్యాయి. స్పందించిన ఫారెస్ట్​ఆఫీసర్లు  చిరుత పిల్లలు సంచరించిన ప్రాంతాన్ని  పరిశీలించారు.  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ఎవరూ భయాందోళన చెందొద్దని, పొలాల్లో తిరిగే రైతులు అలర్ట్​గా ఉండాలని ఆఫీసర్లు సూచించారు.