మార్చి19,20 తేదీల్లో సిటీ కాలేజీలో .. కెమిస్ట్రీ నేషనల్ సెమినార్

మార్చి19,20 తేదీల్లో సిటీ కాలేజీలో .. కెమిస్ట్రీ నేషనల్ సెమినార్

హైదరాబాద్, వెలుగు:  సిటీ కాలేజీలో  కెమిస్ట్రీ  జాతీయ సదస్సును ఈనెల19,20 తేదీల్లో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ​బాల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘రసాయనశాస్త్రం, -బహుశాస్త్రంతర పరిశోధనా అవకాశాలు’ అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో లారస్ ల్యాబ్స్, ఎస్ఎస్ కే బయో సైన్సెస్ సహకారంతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కెమిస్ట్రీ విభాగం అధ్యక్షుడు ఏలూరి యాదయ్య సమన్వయం చేసే ఈ సదస్సులో రాష్ట్ర, రాష్ట్రేతర అధ్యాపకులు, ఆచార్యులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తొలిరోజు ప్రారంభ సభలో  ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి,  ప్రముఖ పరిశోధకులు సీహెచ్. సుబ్రహ్మణ్యం, కె.రాజేందర్ రావు,  ఎన్. రవికుమార్ రెడ్డి, పి.దివాకర్ పాల్గొంటారని వివరించారు.