
హైదరాబాద్, వెలుగు : ఇప్పటికే ప్రకటించిన చేవెళ్ల అభ్యర్థిన మార్చాలని కాంగ్రెస్ భావిస్తోంది. అక్కడి నుంచి షాదాబ్ దర్శన్ పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు నియోజకవర్గం బీఫాంను పెండింగ్లో పెట్టిన ఏఐసీసీ.. షాదాబ్ను ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం.
కాగా చేవెళ్ల కాంగ్రెస్ సీటు మారుస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని, తనను పార్టీ హైకమాండ్ గాంధీ భవన్కు పిలిచి మాట్లాడిందని, నామినేషన్ను చెక్ చేసుకోమని చెప్పిందని చేవెళ్ల స్థానం నుంచి ఇప్పటికే పేరు ప్రకటించిన ఆ పార్టీ అభ్యర్థి భీంభరత్ స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంల పంపిణీ రెండో రోజు కొనసాగింది. సోమవారం 15 మంది అభ్యర్థులు బీఫాంలు తీసుకున్నారు.