కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమేనట

కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమేనట

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో గౌరా గౌరీ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్​బఘేల్ హాజరయ్యారు. ఆచారంలో భాగంగా కొరడా ఝులిపించుకున్నారు సీఎం బఘేల్. దుర్గ్​ జిల్లాలోని జాంజ్​గీర్​ గ్రామంలో కన్నుల పండువగా జరిగిన 'గౌరా గౌరీ' పూజకు భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఛత్తీస్​గఢ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే తాను కొరడా దెబ్బలు తిన్నానని చెప్పారు సీఎం బఘేల్. గౌరా గౌరీ ముందు అందరూ సమానమే అని, ఈ పండుగ సమానత్వాన్ని సూచిస్తుందన్నారు బఘేల్. 

దీపావళి పండుగ సమయంలో గోండు తెగ ప్రజలు ఈ పూజను నిర్వహిస్తారు. మొదట నది ఒడ్డుకు వెళ్లి మట్టిని సేకరిస్తారు. అదే రోజు రాత్రి ఒకరి ఇంట్లో శివుడిని.. మరొకరి ఇంట్లో పార్వతీ దేవిని తయారు చేస్తారు. అనంతరం శివపార్వతుల కల్యాణం జరుపుతారు. ఈ సంప్రదాయాన్ని 'సోటా' అంటారు.

ALSO READ :- AI పిన్ వచ్చేస్తుంది.. స్మార్ట్ ఫోన్లు మాయం.. ఇవి ఎలా పని చేస్తాయంటే..!

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా.. నవంబర్​ 7వ తేదీన 20 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాలకు నవంబర్​17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్​3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.