స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరుపై క్షేత్రస్థాయిలో కారణాలు తెలుసుకుని.. బాధితులకు కావాల్సిన సహాయ, సహకారాలు అందించాలని హోం మంత్రి మహమూద్ అలీ,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  సీఎం కేసీఆర్ సూచించారు.