మార్చి 15లోగా సాగు లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి : సీఎస్ రామకృష్ణారావు

మార్చి 15లోగా సాగు లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి : సీఎస్ రామకృష్ణారావు
  •     అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాగు లెక్కలు పక్కాగా ఉండాలని, డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం  సెక్రటేరియెట్​లో డిజిటల్ క్రాప్ సర్వేపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మార్చి 15వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఆలోగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పనులన్నీ పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు.