దసరా సెలవుల్లో వెళ్లొద్దామా : చూడముచ్చటైన చింతల మాధర

దసరా సెలవుల్లో వెళ్లొద్దామా : చూడముచ్చటైన చింతల మాధర

అడవి తల్లి ఒడి అంటేనే మనసుకి అ హాయినిచ్చే చోటు. అందుకే, వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది ప్రకృతి బాట పడతారు. కళ్లు తిప్పుకోనివ్వని ప్రకృతి అందాల నడుమ కేరింతలు కొడుతూ, ఫొటోలు దిగుతూ మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఈ సీజన్లో చూడదగ్గ టూరిస్ట్ ప్లేస్లు తెలంగాణలో బోలెడు ఉన్నాయి. వాటిల్లో ఒకటి చింతలమాధర వాటర్ ఫాల్. ఎటుచూసినా పచ్చదనంతో ఆకుపచ్చ చీర కట్టినట్టు ఉండే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో ఉంది ఈ జలపాతం.

దట్టమైన అటవీ ప్రాంతంలోని తిర్యాని మండలం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వాటర్ ఫాల్ . దీన్ని 'తిర్యానీ వాటర్ ఫాల్' అని కూడా పిలుస్తారు. ఇక్కడ యాభై అడుగుల ఎత్తు ఉన్న బండరాయి మీద నుంచి నీళ్లు కిందకు జారుతున్నదృశ్యం చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లే తొవ్వంతా కొండలు, పచ్చదనంతో చూడముచ్చటగా ఉంటుంది. జలపాతానికి వెళ్లే దారిలోనే గిరిజనుల ఇళ్లు ఉంటాయి. వాళ్ళ కట్టూబొట్టూ, బతుకు చిత్రాన్ని దగ్గరగా చూడడం మర్చిపోలేని ఫీల్ని ఇస్తాయి. ఈ వాటర్ఫాల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ జలపాతం లోని నీళ్లు నీలం రంగులో, చాలా తేటగా ఉంటాయి. మంచిర్యాల, జైనూర్ ప్రాంతాల నుంచి సెలవు రోజుల్లో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. కొందరు ఫ్యామిలీతో పిక్నిక్కు వచ్చి ఎంజాయ్ చేస్తారు. తెలంగాణలో ఇంత క్లీన్ వాటర్ ఉన్న మరొక టూరిస్ట్ ప్లేస్ ఏటూరు నాగారంలోని కొంగల (పులిమడుగు) వాటర్ ఫాల్ మాత్రమే.

ఇలా వెళ్లాలి

మంచిర్యాల నుంచి అరవై కి.మీ జర్నీ చేస్తే, చింతలమాధర వాటర్ ఫాల్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయితే మంచిర్యాల హైవే మీదుగా దాదాపు 320 కి.మీ ట్రావెల్ చేయాలి.

ALSO READ : IND vs PAK: ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. మ్యాచ్ మలుపుతిప్పిన కుల్దీప్ యాదవ్