తారకరత్న మృతి పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి

తారకరత్న మృతి పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి

సీని నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది బాధకరమైన విషయమన్న చిరంజీవి.. అత్యంత టాలెంట్, తెలివైన, ఆప్యాయతగల యువకుడు తారకరత్న అని కొనియాడారు. అతని కుటుంబ సభ్యులు,అభిమానులందరికీ హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాని ట్వీట్ చేశారు. అతని ఆత్మకు శాంతి కలుగుగాక.. శివైక్యం అంటూ చిరు పోస్ట్ చేశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో గత 23 రోజులుగా చికిత్స  పొందుతూ తారకరత్న  కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. 

జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్‌ తో కలిసి పాదయాత్ర చేస్తుండగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.