శృతిహాసన్ ను బెదిరించారేమో.. చిరు సెటైర్లు

శృతిహాసన్ ను బెదిరించారేమో.. చిరు సెటైర్లు

బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ నటించిన  మూవీ వాల్తేరు వీరయ్య  సంక్రాంతి కానుకగా ఈ నెల 13న రిలీజ్ కానుంది. నిన్న విశాఖ ఆర్కే బీచ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. చిరంజీవి,రవితేజ హాజరయ్యారు. అయితే హీరోయిన్ శృతిహాసన్ ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. అయితే తనకు జ్వరం వచ్చిందని..కొవిడ్ టెస్టు కూడా చేయించుకున్నానని నిన్నశృతిహాసన్  సోషల్ మీడయాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రెండు రోజుల క్రితం బాలయ్య వీరసింహారెడ్డి ఫంక్షన్ కు వచ్చి వాల్తేరు వీరయ్యకు అటెండ్ కాకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్నవేదికపై మాట్లాడిన చిరంజీవి శృతిహాసన్ రాకపోవడంపై సెటైర్లు వేశారు.

‘ ఆ అమ్మాయి  శృతిహాసన్.. మరి ఒంగోలులో ఏం తిన్నదో తెల్వదు జ్వరం వచ్చిందంట.. లేక ఎవరైనా బెదిరించారో తెల్వదు. ఫోన్ చేసి తనకు జ్వరం వచ్చింది. కొవిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నా సారీ అంటూ చెప్పింది. ఈ సినిమాలో శృతిహాసన్ చాలా బాగా చేసింది. గ్లామర్ తో పాటు, యాక్షన్ సీన్ లో కూడా బాగా చేసింది. మైనస్ 8 డిగ్రీల ఉష్గోగ్రతలో కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేసింది. శృతిహాసన్ ప్రొఫెషనలిజానికి హ్యాట్సాప్ ’’ అంటూ చిరు వ్యాఖ్యానించారు.

ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. ఇందులో కేథరిన్, బాబీ సింహా, నాజర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇటీవలె రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. గాడ్ ఫాదర్ తర్వాత చిరు నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.