ఇవాళ(గురువారం) స్వర్గీయ నందమూరి తారక రామారావు 97 వ జయంతి సందర్భంగా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో కలిసిన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెగస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్,చిరు ఒకరినొకరు స్వీట్ తినిపించుకుంటున్న ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..‘అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి తిరుగులేని మనిషి మూవీలో కలిసి నటించారు.
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం
నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.
వారితో కలిసి నటించడం నా అదృష్టం.
పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ… pic.twitter.com/LgSKsItxdO— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2020