
చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్ అంటూ రకరకాల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ వరుసలో త్రిష పేరు కూడా ఉంది. అయితే ఎవరూ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయకపోవడంతో నయనతార, కాజల్ల మాదిరిగానే ఈమె పేరు కూడా బైటికొచ్చింది అనుకున్నారంతా. కానీ అందరూ అనుకున్నట్టు అది పుకారు కాదు.. నిజమే. దానిని తేల్చింది కూడా సాక్షాత్తూ త్రిషనే. రీసెంట్గా ఓ సినీ అనలిస్ట్ ఒక ట్వీట్ పెట్టాడు. అందులో ‘‘వచ్చే యేడు త్రిషకి చాలా ప్రత్యేకం. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, మోహన్లాల్, జీతూ జోసెఫ్ల మలయాళ చిత్రం, చిరంజీవి 152 వ చిత్రం.. ఈ మూడింటిలో ఆమే హీరోయిన్’’ అన్నాడు. దానికి త్రిష అవును అన్నట్టుగా ఎమోజీని పోస్ట్ చేసింది. దాంతో ఈ వార్త నిజమే అని తేలిపోయింది. నాయకి, చీకటిరాజ్యం వంటి తెలుగు సినిమాలతో పలకరించింది తప్ప ‘లయన్’ సినిమా తర్వాత త్రిష స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటించలేదు. మళ్లీ ఇప్పుడు నటించడం, అదీ మెగాస్టార్ తో కావడం విశేషం. ఆల్రెడీ వీళ్లిద్దరూ కలిసి ‘స్టా లిన్’లో కనువిందు చేశారు.ఇప్పుడు మరోసారి జోడీ కట్టనున్నారు. ఈ సినిమా తర్వాత త్రిష మళ్లీ తెలుగులో బిజీ అయిపోయే చాన్స్ లేకపోలేదు.