హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎంను కలిసిన చొప్పదండి ఎమ్మెల్యే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎంను కలిసిన చొప్పదండి ఎమ్మెల్యే

గంగాధర, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను సీఎంతో చర్చించారు. 

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధికి, గంగాధర మండలంలోని నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి  నిధులు మంజూరు చేయాలని కోరారు.