సిటీలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకలు

సిటీలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకలు

హైదరాబాద్: క్రిస్మస్ పండుగకు ఇంకా 15 రోజులు మాత్రమే ఉండటంతో సిటీలో సందడి మొదలైంది. హోటళ్లు, దుకాణాలు క్రిస్మస్ ట్రీలు, లైట్లతో అందర్నీ ఆకట్టుకునేలా అలంకరిస్తున్నారు. చాలా చోట్ల కేక్ మిక్సింగ్ ఈవెంట్లు పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. ఓ హోటల్ మేనేజ్ మెంట్ సంస్థ, కలినరీ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ తాజ్ బంజారా హోటల్ లో సందడి గా సాగింది. 100 కేజీల డ్రై ఫ్రూట్స్ , నట్స్ , లిక్కర్ తో కలుపుతూ కేక్ మిక్సింగ్ పార్టీ నిర్వహించారు. స్టూడెంట్స్ తో పాటు పలువురు ఈ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు.

డ్రై ఫ్రూట్ మిక్స్ ను క్రిస్మస్ వరకు ఉంచి.. పండుగ రోజున ప్లమ్ కేక్స్ చేస్తామని నిర్వాహకులు చెప్పారు. ఈవెంట్ లో హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ కొత్త స్టూడెంట్స్ కు వెల్కం చెప్తూ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ డ్యాన్స్లు, కలర్ ఫుల్ డ్రెస్సుల్లో ఫ్యాషన్ షో తో ఆకట్టుకున్నారు.