
మెదక్ టౌన్, వెలుగు: మెదక్చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య, చర్చి పాస్టర్లు దైవసందేశాన్ని అందించి భక్తులను దీవించారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో చర్చి బాధ్యులు శాంసన్, సందీప్, సంపత్, సువన్ డగ్లస్, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చర్చి ఆవరణలో, గోల్బంగ్లా వద్ద టెంట్లు వేసుకొని వంటలు వండుకొని తిని ఆనందంగా గడిపారు. -