కృష్ణా జిల్లా గాంధీనగర్ పోలీస్ క్వార్టర్స్లో సీఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1989 బ్యాచ్కి చెందిన సీఐ సూర్యనారాయణ తన ఇంట్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. గత కొంతకాలంగా విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్లో సూర్యనారాయణ సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సూర్యనారాయణ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. సీఐ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సీఐ సూర్యానారయణ ఏలూరు రేంజ్లో వీఆర్లో ఉన్నారు.