
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే లిక్కర్ స్కాం వంటి కేసుల్లో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో మరో భారీ స్కాం బయటపడింది.. సినిమా యానిమేషన్ పేరుతో సుమారు రూ. 500 కోట్లకు పాల్పడ్డ విజయవాడ వాసి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. యూపిక్స్ పేరుతో ఆఫీసు ఓపెన్ చేసి కొట్లల్లో పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడ్డాడు కిరణ్.
కిరణ్ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నేర్పుతామని నమ్మించి సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది... కిరణ్ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయిన ఆరుగురు ఏప్రిల్ నెలలో సత్యనారాయణపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా 80 మందికి పైగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
కిరణ్ ను ఉత్తరాఖండ్ లో అదుపులోకి తీసుకున్న యర్రగొండపాలెం పోలీసులు.. అక్కడి నుంచి పీటీ వారెంట్ పై విజయవాడకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఓ మాజీ పోలీసు అధికారి హస్తం కూడా ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు పోలీసులు.