ఎమ్మెల్యే రాజాసింగ్​జాగ్రత్తగా ఉండాలి .. సిటీ పోలీసుల లేఖ

ఎమ్మెల్యే రాజాసింగ్​జాగ్రత్తగా ఉండాలి .. సిటీ పోలీసుల లేఖ
  • బుల్లెట్​ప్రూఫ్​వెహికల్​లోనే జర్నీ చేయాలి

బషీర్​బాగ్, వెలుగు: గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సిటీ పోలీసులు లెటర్​రాశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు. ఎక్కడికైనా వెళ్తే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ప్రభుత్వం కేటాయించిన 1+4 సెక్యూరిటీని వినియోగించుకోవాలన్నారు. 

రాజాసింగ్ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్న సంగతిని గుర్తుచేశారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకు రోడ్లు ఉన్నాయని , తాను ప్రజలను కలవాలంటే బైక్ పైనే వెళ్లాల్సి వస్తుందని రాజా సింగ్ తెలిపారు.