సివిల్​కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి : దర్శనాల శంకరయ్య

సివిల్​కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి : దర్శనాల శంకరయ్య

హైదరాబాద్​సిటీ, వెలుగు: సివిల్​కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని సివిల్​కాంట్రాక్టర్ అసోసియేషన్​అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య కోరారు. సోమవారం సిటీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టర్ల సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన మహేశ్​కుమార్​గౌడ్​సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారన్నారు.

 చిన్న కాంట్రాక్టర్లకు త్వరగా బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. మహేశ్​కుమార్​గౌడ్​ను కలిసిన వారిలో అసోసియేషన్​చీఫ్ అడ్వైజర్ అజయ్ కుమార్, కాంట్రాక్టర్లు వెంకట్రామిరెడ్డి, రఘు, హనుమంత రెడ్డి, మల్లేశం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ ఉన్నారు.