న్యూఢిల్లీ : సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ సెంటర్‘అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్’ నకు ఎంపిక చేసింది. జస్టిస్ చంద్రచూడ్.. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా న్యాయవాద వృత్తికి చేసిన సర్వీస్కు గాను ఈ అవార్డ్కు ఎంపికయ్యారు. ఈ నెల 11న ఆన్లైన్లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు. ఈ ఈవెంట్లో హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ ప్రొఫెసర్ డేవిడ్ విల్కిన్స్ పాల్గొని సీజేఐతో మాట్లాడుతారు.
జస్టిస్ చంద్రచూడ్.. యునైటెడ్ స్టేట్స్లోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీతో పాటు జురిడికల్ సైన్సెస్(ఎస్జేడీ)లో డాక్టరేట్ పొందారు. అయోధ్య వివాదం కేసుతో సహా పలు కీలక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు బెంచ్ లలో పనిచేశారు. నవంబర్ 9, 2022న 50వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు.
