న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్లకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ షాక్ ఇచ్చారు. అర్జంట్ లిస్టింగ్ కేసులను ప్రస్తావించేందుకు వారికి అనుమతి ఇవ్వలేదు. ‘‘సీనియర్ అడ్వొకేట్లను అనుమతించే ప్రశ్నే లేదు” అని ఎన్వీ రమణ స్పష్టంచేశారు. సీజేఐ నేతృత్వం లోని బెంచ్ వద్ద అర్జెంట్ లిస్టింగ్ కేసులను ప్రతీరోజూ ప్రస్తావించాలె. తన కేసు అర్జెంట్ లిస్టింగ్ చేయాలంటూ.. కోర్టు రూం ముందు నిలబడి ఉన్న ఓ సీనియర్ అడ్వొకేట్ సీజేఐను కోరారు.
దీంతో జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ..‘‘సీనియర్స్ను ఎంటర్టైన్ చేయను. రేపు మెన్షన్ చేయాలని దయచేసి మీ అడ్వొకేట్ ఆన్ రికార్డు(ఏఓఆర్) ను అడగండి” అని చెప్పారు. క్యూలో కపిల్ సిబల్తో పాటు ఏఎం సింఘ్వీ కూడా ఉన్నారు. వీరిని కూడా బెంచ్ వద్దకు వచ్చేందుకు సీజేఐ అనుమతించలేదు.