భద్రాద్రి కొత్తగూడెంలో రసాభాసగా మారిన సర్వసభ్య సమావేశం

భద్రాద్రి కొత్తగూడెంలో  రసాభాసగా మారిన సర్వసభ్య సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ స్థానిక MPDO కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు టీఆర్ఎస్  వైస్ ఎంపీపీ. ప్రస్తుతం ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు గతంలో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇద్దరు చెరొక రెండున్నర సంవత్సరాలు ఎంపీపీ గా పదవి బాధ్యతలు తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ప్రస్తుత ఎంపీపీ భూక్య విజయలక్ష్మి రెండున్నరేళ్లు అవుతున్న పదవి నుంచి తప్పుకోకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు వైస్ ఎంపిపి బాణోత్. ఎంపీపీ విజయలక్ష్మి రాజీనామా చేసి పదవిని తనకు ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు. దీంతో ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలు పదవుల కోసం సభలో గొడవకు దిగారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.