పెంపుడు కుక్క కారణంగా గొడవపడ్డ ఇరువర్గాలు

పెంపుడు కుక్క కారణంగా గొడవపడ్డ ఇరువర్గాలు

కర్నూలు: పెంపుడు కుక్క కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఔకు మండలం కోనపురం హరిజన వాడలో జరిగింది.  హరిజన వాడలో నివాసముంటున్న ఓ కుటుంబం కుక్కను పెంచుతున్నారు. ఇంటి ముందు తిరుగుతున్న ఆ కుక్క.. అదే పేటలోని పాలు అమ్ముతున్న వ్యక్తిని కరిచింది. దీంతో అతడు కోపంతో ఆ యాజమానితో గొడవకు దిగాడు. ఈ గొడవ కారణంగా ఇరు వర్గాలకు చెందినవారు..  కట్టెలు రాళ్లతో దాడి చేసుకున్నారు.  ఇరు వర్గాల వారికి గాయాలు అయ్యాయి. కొంత మంది ఆడవాళ్లకు చేతులకు గాయాలవడంతో.. వారిని చికిత్స నిమిత్తం బనగానపల్లె  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఔకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.