పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే : వైఎస్ షర్మిల

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే :  వైఎస్ షర్మిల

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ దర్యాప్తు మీద పెట్టిన శ్రద్ధ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద ఎందుకు పెట్టడం లేదు? బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటపడతాయనా? "బంది పోట్ల రాష్ట్ర సమితి" నేతల కండ్లకు, చెవులకు 30 లక్షల మంది నిరుద్యోగుల కన్నీటి రోదన కనపడడం, వినపడటం లేదా? అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. పదో తరగతి పేపర్ బయటకు వచ్చేంతగా తలుపులు తెరిచారంటే మీది దిక్కుమాలిన పాలన కాదా? అని ప్రశ్నించారు. 

పేపర్ బయటికి రాగానే ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసి, బలి చేసిన మీరు.. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు, బోర్డు సభ్యులు, ఛైర్మన్ ను వెంటనే ఎందుకు తొలగించలేదు? అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో బీఆర్ఎస్ బడా నేతల హస్తం ఉందనా? లేక వాళ్లంతా మీ తొత్తులనా? అంటూ మండిపడ్డారు. పదో తరగతి పేపర్ లీకుల్లో స్వయానా ప్రతిపక్ష నేత హస్తం ఉందని తేల్చిన మీ పోలీస్ వ్యవస్థ.. టీఎస్పీఎస్సీ లీకుల స్కాంలో దాగి ఉన్న మీ ఇంటి దొంగలను బయట పెట్టకపోతే.. రానున్న ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి నిరుద్యోగులు ఘోరి కట్టడం తథ్యం అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు రాసుకొచ్చారు.

https://twitter.com/realyssharmila/status/1643915933378031618