
ఖమ్మంలో RDA ఆఫీసు ముందు ఉన్న రైతు బజారును తరలించవద్దని.. రైతులు పురుగుల మందు డబ్బాతో హాల్ చల్ చేశారు. అర్బన్ పోలీసు స్టేషన్ ముందున్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన రాజకీయల కోసమే రైతు బజారును…తరలించే ప్రయత్నం చేస్తున్నరని ఆరోపించారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్, మంత్రి స్పందించి.. రైతు బజారును తరలించకుండా చూడాలన్నారు. లేకపోతే ఆందోళనని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.