యోగాకు మార్కెటింగ్ చాలా వీక్ గా ఉంది.. అందుకే నేను ముందుకు తీసుకెళ్తున్నా: సీఎం చంద్రబాబు..

యోగాకు మార్కెటింగ్ చాలా వీక్ గా ఉంది.. అందుకే నేను ముందుకు తీసుకెళ్తున్నా: సీఎం చంద్రబాబు..

శుక్రవారం ( జూన్ 27 ) విజయవాడలో టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ 2.0లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. బాబా రాందేవ్ ను 30 సంవత్సరాలకు ముందు కలిశానని.. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా యోగా టీచ్ చేసేవారని అన్నారు.  ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వేలాది మంది యోగా కోసం వస్తారని అన్నారు చంద్రబాబు. బాబా రాందేవ్ యోగాను ఓ మాస్ మూమెంట్ గా తీసుకొచ్చారని అన్నారు.యోగాకు మార్కెటింగ్ చాలా వీక్ గా ఉందని..  అందుకే యోగాను ముందుకు తీసుకువెళుతున్నానని అన్నారు చంద్రబాబు.

ఈ మధ్యనే విశాఖలో యోగాంధ్ర ను నిర్వహించామని.. ప్రధాని నరేంద్రమోడీ యోగా డేను గ్లోబల్ డే గా నిర్వహించేలా ఐక్యరాజ్య సమితి ప్రకటించేలా చేశారని అన్నారు. విశాఖలో అయిదు లక్షల మందితో యోగా డేను నిర్వహించే ప్రయత్నం చేశామని..  అనేక రికార్డులు సాధించామని అన్నారు చంద్రబాబు. ఏపి ప్యూచర్ డెస్టినేషన్ ఫర్ వెల్ నెస్ అండ్ హ్యాపీనెస్ అని బాబాకు హమీ ఇస్తున్నానని అన్నారు. తాము కూడ బాబా సర్వీసులు తీసుకుంటామని.. ఆయన చాలా మంచి మార్కెటింగ్ మేనేజర్ అనేది అందరికి తెలుసని అన్నారు చంద్రబాబు. 

తాను, రాందేవ్ బాబా కామన్ కాజ్ కోసం పనిచేస్తున్నామని.. తాను రాష్ట్రానికి సేవచేస్తుంటే.. స్పిరిచ్చువల్ లీడర్ గా ఆయన కూడా దేశానికి సేవ చేస్తున్నారని అన్నారు చంద్రబాబు. బాబా రాందేవ్ జి  టూరిజంకు అడ్వయిజర్ గా ఉండాలని కోరుతున్నానని.. ఎందరో సెలబ్రిటీలు ఉన్నా రాందేవ్ భాబా కూడా గోప్ప సెలబ్రిటీనే అని అన్నారు చంద్రబాబు.