ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రణరంగం మొదలైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు.2024 ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకొనేవి కాదంటూ..... 3 వేల రూపాయిల పెన్షన్ మీ ఇంటికి రావాలన్నా.. భవిష్యత్తులో పెరగాలన్నా... ప్రజల సంక్షేమం... అభివృద్దిని నిర్ణయించే ఎన్నికలు అని సిద్దం సభలో సీఎం జగన్ అన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని దెందులూరు సభలో సీఎం జగన్ ప్రశ్నించారు. అబద్దాల పునాదులమీద ప్రతిపక్షాలు ప్రచారం మొదలు పెట్టాయి. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతర తోడేళ్లు కలిసి జగన్పై పోటీకి దిగుతున్నారని జగన్ అన్నారు.
ఇంకా ఏమన్నారంటే
- మరో చారిత్ర విజయానికి సిద్దమా అని సభలో ప్రజలను ప్రశ్నించారు
- జగన్ ఒంటరి వాడు కాదు.. నాకు దేవుడు, ప్రజలు తోడున్నారు.
- దుష్ట చతుష్టయంపై విజయానికి సిద్దమా...
- చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడాలి
- ఎన్నికల రణక్షేత్రంలో మీరు కృష్ణుణి పాత్ర పోషిస్తే.. నేను అర్జునిడి పాత్ర పోషించి ... కౌరవులపై పోరాడతా
- రామాయణం, భారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్ కో
- పొత్తులు వారి సైన్యమైతే.. దేవుడు, ప్రజాబలమే నాది
- చంద్రబాబు హయాంలో పేదల ఖాతాల్లో డబ్బులు వచ్చాయా
- నా కుటుంబ సైన్యం ఇక్కడే ఉంది
- ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను 99 శాతం అమలు చేశా
- సంక్షేమం, అభివృద్దిపై టీడీపీ దండయాత్ర చేస్తుంది
- గ్రామంలో అభివృద్దిపై పెత్తందారులు దండయాత్ర చేస్తారు
- ఎన్నికల మ్యానిఫెస్టో పవిత్ర గ్రంధం
- సచివాలయ వ్యవస్థను మీ జగన్.. వైఎస్సార్ సీపీ తీసుకొచ్చింది
- ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందిస్తున్నాం
- వివక్ష లేని సచివాలయ పాలన తెచ్చా
- కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అభివృద్ది చేశా
- గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 10 శాతమైనా అభివృద్ది చేశాడా
- నాడు నేడు పథకంలో పాఠశాలలను ఆధునీకరించాం
- విద్యార్థుల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి
- నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతానికి పైగా బీసీలకు ఇచ్చాం
- సంక్షేమం కోసం 2 లక్షల 55 వేల కోట్లు ఖర్చు పెట్టాం
- బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి
- వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చా
- 66 లక్షల కుటుంబాలకు సంక్షేమం అదిస్తున్నాం
- ప్రేమ, అభిమానం, కమిటిమెంట్ చూపా
- సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశా