మొదటి సారిగా సెక్రటేరియట్ కి సీఎం జగన్

మొదటి సారిగా సెక్రటేరియట్ కి సీఎం జగన్

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టారు.  తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.

అంతకు ముందు సీఎం జగన్ కి  ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు . ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉదయం 9.30 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం కానున్నారు.  సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి  హాజరవుతారు.