
సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టారు. తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.
అంతకు ముందు సీఎం జగన్ కి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సెక్రటేరియట్కు బయల్దేరారు . ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉదయం 9.30 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి హాజరవుతారు.