YSR వాహనమిత్ర రెండో విడత ను ప్రారంభించిన సీఎం జగన్

YSR వాహనమిత్ర రెండో విడత ను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ YSR వాహన మిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందనుంది. ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  మాట్లాడారు సీఎం జగన్. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూశానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు నెలల ముందుగానే కార్మికులకు రెండో విడత ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిమానాలతో కార్మికులు అనేక ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకానికి అర్హత ఉండి సాయం అందని వారు స్పందన యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు సీఎం జగన్.