మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం జగన్

మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం జగన్

సీఎం  హోదాలో మొదటి సారిగా సెక్రటేరియట్ లోకి  ప్రవేశించిన  YS జగన్‌మోహన్‌రెడ్డి..మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ.. మొదటి సంతకం చేశారు. తర్వాత ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ పరిమితి 10 లక్షల రూపాయలవరకు పెంచిన ఫైల్‌పై సీఎం జగన్‌ మూడో సంతకం చేశారు.