ఆటోవాలాలకు రూ.10వేలు.. స్కీమ్ ప్రారంభించిన CM జగన్

ఆటోవాలాలకు రూ.10వేలు.. స్కీమ్ ప్రారంభించిన CM జగన్

YSR వాహన మిత్ర పథకం ప్రారంభం

ఏపీలో YSR  వాహన మిత్ర పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇవాళ (శుక్రవారం) తూర్పుగోదావరి జిల్లా  ఏలూరులో పథకం ప్రారంభంలో పాల్గొన్న జగన్ ఆటోవాలా అంగి వేసుకున్నారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు.

ఏలూరులోనే ఈ హామీని ఇచ్చానని… ఇప్పుడు ఏలూరులోనే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. సొంత ఆటో, కారు ఉన్నవారికి ఏటా రూ. 10 వేల సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తామన్నారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్ధి పొందుతారని చెప్పారు. డ్రైవర్ల అకౌంట్లలోకి ఈ డబ్బును నేరుగా జమ చేస్తామన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు సీఎం వైఎస్ జగన్.