
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా అక్కడికి వెళ్లారు. ఆయనకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. తర్వాత స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం వైఎస్ జగన్… శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.