పోలవరాన్ని సందర్శించిన వై ఎస్ జగన్

పోలవరాన్ని సందర్శించిన వై ఎస్ జగన్

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. స్పిల్ వే, స్పిల్ చానల్, కాలువల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. మొదట పోలవరం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన జగన్.. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేయగలరని కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఎప్పటి వరకు ఇవ్వొచ్చనే విషయాన్ని ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష చేయనున్నారు సీఎం.