అందరి ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చింది:కేసీఆర్

అందరి ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చింది:కేసీఆర్

పులి నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చిండు. రాష్ట్ర సాధనలో అందరి భాగస్వామ్యం ఉందని చెప్పిండు. ఇందుకు మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికైంది. కురవి వీరభద్రుడి దయ, మానుకోట రాళ్ళ బలంతోనే తెలంగాణ కల సాకారమైందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో తాను మహబూబాబాద్ ప్రాంతంలో తిరిగానని.. అప్పుడున్న కరువు పరిస్థితులు తనకు బాధ కలిగించాయని అన్నారు. మంచిర్యాల, రామగుండం వద్ద గోదావరి దాటుతున్న సమయంలో.. గోదారమ్మకు చిల్లర డబ్బులు వేసి మొక్కుకునే వాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.  తెలంగాణ వస్తే ఏటూరు నాగారంలోని కురవి వీరభద్ర స్వామికి బంగారు మీసాలు చేపిస్తానని మొక్కానని.. తానే స్వయంగా వచ్చి మొక్కు తీర్చుకుంటానని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో వెలుగులు నింపడం కోసమే జిల్లాల సంఖ్య పెంచామని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత చాలా మార్పులు వచ్చాయని, ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు.