సీఎం కేసీఆర్ ములుగు జిల్లాలోని రామన్న గూడెంలో ఏరియల్ సర్వే చేశారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాలను చూస్తూ సీఎం ఏటూరునాగారానికి చేరుకున్నారు. అక్కడి ఐటీడీఏ గెస్ట్ హౌజ్ లో లంచ్ చేశారు.
#WATCH | Telangana CM K Chandrashekar Rao conducts an aerial survey of flood-affected areas near Bhadradri Kothagudem pic.twitter.com/QiowN3b8j1
— ANI (@ANI) July 17, 2022
అనంతరం కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి ముంపు బాధితులను సీఎం పరామర్శిస్తారు. మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిని అద్దంపట్టే ఫొటోలతో ఏర్పాటుచేసి ఎగ్జిబిషన్ కు కేసీఆర్ వెళ్తారు. ఏరియల్ సర్వే సందర్భంగా హెలికాప్టర్ లో సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, తదితరులు ఉన్నారు.