ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి క్లాస్ పీకిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి క్లాస్ పీకిన సీఎం కేసీఆర్

జమ్మికుంట, వెలుగు: అందరినీ కలుపుకొని పోవాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ​క్లాస్ ​పీకారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్​ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్​రావుతో పాటు పలువురు నేతలు శనివారం వరంగల్​ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్​ను కలిసి బోకే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డితో  సీఎం  కేసీఆర్​‘ఏయ్​కౌశిక్​.. హుజూరాబాద్​లో  అందరినీ కలుపుకపో.. ప్రజల మన్నలను పొందు’ అంటూ క్లాస్​ తీసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హుజూరాబాద్​లో ఉప ఎన్నిక తర్వాత కౌశిక్​ రెడ్డి, హుజూరాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్​మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలపై ఆయన వాడే భాషను  టీఆర్ఎస్​లీడర్లే  తప్పుబడుతున్నారు.  కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి నియోజకవర్గంలోని  ఐదు మండలాల్లో  సభలు నిర్వహించిన కౌశిక్​ రెడ్డి ఎక్కడా  గెల్లు శ్రీనివాస్​ యాదవ్​ను ఆహ్వానించలేదు. ఈ పరిణామాలపై శ్రీనివాస్​యాదవ్​ తన అసంతృప్తిని పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఆ వ్యవహారం గురించి ఇంటలిజెన్స్​రిపోర్ట్​లు రావడంతోనే కౌశిక్​రెడ్డిపై సీఎం సీరియస్​ అయినట్టు తెలుస్తోంది.