కేసీఆర్ తెలంగాణ ద్రోహి

కేసీఆర్ తెలంగాణ ద్రోహి

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా TRS ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దళితులను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ సీఎం అయిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు మోత్కుపల్లి. తాను కూడా గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని… ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయో తేల్చుకుందామా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని అన్నారు. మరోవైపు బీసీ, దళిత ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.