- మునుగోడు ఎన్నికలు తమకు ఎంత కీలకమో లీడర్లకు చెప్పే ప్రయత్నం
- ఓటర్లు, పార్టీ కేడర్ను సమన్వయం చేసేందుకు ప్రతాప్రెడ్డికి బాధ్యతలు
- గత ఎన్నికల్లో లెంకలపల్లిలో కాంగ్రెస్దే హవా
- ఈసారి టీఆర్ఎస్కు మెజారిటీ దక్కితే గ్రామం దశ తిరుగుతుందని ప్రచారం
నల్గొండ, వెలుగు: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి , దేశ్కీ నేతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం కేసీఆర్, త్వరలో ఎన్నికలు జరగనున్న మునుగోడు నియోజకవర్గంలోని లెంకలపల్లి అనే చిన్న గ్రామంలో మెజారిటీ పై ఫోకస్ పెట్టారు. ఢిల్లీ కేంద్రంగా జాతీయస్థాయిలో చక్రం తిప్పాల్సిన టైంలో టీఆర్ఎస్ అధినేత ఈ లెంకలపల్లి ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవడంపై ఇంట, బయట చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ద్వారా దేశరాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్కు మునుగోడు రూపంలో తొలిపరీక్ష ఎదురుకానుంది. ఇక్కడ విజయం సాధించకపోతే జాతీయస్థాయిలో పరువుపోయే ప్రమాదం ఉండడంతో మునుగోడు బై ఎలక్షన్ను సీఎం సీరియస్గా తీసుకున్నారు. ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లకు ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తాను కూడా లెంకలపల్లి అనే గ్రామ ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవడం ద్వారా మునుగోడు బైఎలక్షన్ ఎంత కీలకమో తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫస్ట్ టైం ఇన్చార్జి బాధ్యతలు..
మునుగోడు ఎలక్షన్ను సీరియస్గా తీసుకున్న టీఆర్ఎస్ హైకమాండ్ గురువారం ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. 2వేల నుంచి 3వేల ఓట్లను (సగటున 2,500 ఓట్లను) ఒక యూనిట్గా విభజించి 86 మంది ఎ మ్మెల్యేలకు, 14 మంది మంత్రులకు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లకు బాధ్యతలు అప్పగించారు. కొత్త గా ఏర్పడ్డ గట్టుప్పుల్బాధ్యతలు మంత్రి కేటీఆర్కు, మర్రిగూడ మండల కేంద్రం బాధ్యతలు మంత్రి హరీశ్రావుకు అప్పగించగా, సీఎం కేసీఆర్ మర్రిగూడ మండలం లోని లెంకలపల్లి బాధ్యతలు తీసుకున్నారు. కేసీఆర్ఇలా ఒక గ్రామానికి ఎన్నికల ఇన్ చార్జిగా ఉండడం ఇదే మొదటిసారి. అందరి లాగే కేసీఆర్ కూడా రొటీన్గా ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా మునుగోడు ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్కు ఎంత కీలకమో పార్టీ లీడర్లు, క్యాడర్కు చెప్పేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. కాగా, సీఎం ఇన్చార్జిగా వ్యవహరించనున్న లెంకలపల్లికి ఆయన తరుచూ వచ్చి, నేతలు, కార్యకర్తలను కలుసుకోవడం, ఇంటింటి ప్రచారం నిర్వహించే అవకాశం లేకపోవడంతో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి సమన్వయకర్తగా వేశారు. కేసీఆర్ పరిధిలోకి లెంకలపల్లి మాత్రమే కాకుండా సరంపేట కూడా రానుంది. ఈ రెండు గ్రామాల్లో కలిపి 2,830 మంది ఓటర్లు ఉన్నారు. లెంకలపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో చేరగా, ఎంపీటీసీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. 2018 ఎన్నికల్లో లెంకలపల్లి, సరంపేట రెండు చోట్లా కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. లెంకలపల్లిలో టీఆర్ఎస్కు 54 0 ఓట్లు పోల్కాగా, కాంగ్రెస్కు 1007 ఓట్లు, బీజేపీకి 76 ఓట్లు పడ్డాయి. సరంపేటలో టీఆర్ ఎస్కు 215, కాంగ్రెస్ 534, బీజేపీ 47 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఇన్చార్జిగా వ్యవహారించే ప్రతి ఎమ్మెల్యే పరిధిలో 51 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పడాలని టార్గెట్ పెట్టారు. ఈలెక్కన కేసీఆర్ ఇన్చార్జిగా ఉన్న లెంకలపల్లి లో మెజారిటీ సాధించడంపై ప్రతాప్రెడ్డితో పాటు టీఆర్ఎస్ లీడర్లంతా ఫోకస్పెట్టారు. ఈక్రమంలోనే సీఎం కే సీఆర్ లెంకలపల్లిని దత్తత తీసుకున్నట్లేనని, ఇక్కడ మెజార్టీ ఎక్కు వగా వస్తే లెంకలపల్లి విలేజ్దశమారుతుందని ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం మునుగోడుతో ముడిపడి ఉంది
తెలంగాణ ఆత్మగౌరవం మునుగోడు ఉప ఎన్నికతో ముడి పడి ఉంది. బీ ఆర్ఎస్తో కేసీఆర్ సత్తా చాటాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని గుజరాతీల ముందు తాకట్టు పెట్టనివ్వరు. రాజగోపాల్ రెడ్డి కా వాలని తెచ్చుకున్న ఎలక్షన్ ఇది. పింఛన్లు, భగీరథ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజల్లో బలంగా నాటుకున్నాయి. ప్రజల మద్ధతు టీ ఆర్ఎస్కే ఉంటుందని భావిస్తున్నాం. కేసీఆర్ ఇన్చార్జిగా తీసుకున్న గ్రా మంలో మంచి మెజార్టీ సాధిస్తామనే నమ్మకం ఉంది. గత రెండు రోజుల నుంచి గ్రామంలో పర్యటిస్తున్న. ఇక్కడి పరిస్థితులు ఇప్పటికైతే టీఆర్ఎస్కే అనుకూ లంగా ఉన్నాయి.
– -ఒంటేరు ప్రతాప్ రెడ్డి, లెంకలపల్లి ఇన్చార్జి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్