ఫాంహౌస్ ఫైల్స్ సీబీఐ, ఈడీకి పంపినం : కేసీఆర్

ఫాంహౌస్ ఫైల్స్  సీబీఐ, ఈడీకి పంపినం : కేసీఆర్

మొయినాబాద్ ఫాంహౌస్ ఫైల్స్ హైకోర్టుతో పాటు సీబీఐ,ఈడీలకు పంపించామని సీఎం కేసీఆర్ అన్నారు. సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్ లతో పాటు అన్ని వ్యవస్థలకు పంపిస్తామన్నారు. ఫాంహౌజ్ ఫైల్స్ మూడుగంటలు ఉన్నాయని చెప్పారు. రామచంద్రభారతి పైలట్ రోహిత్ రెడ్డిని కలిశాడని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు విరోచితంగా కుట్రను బద్దలు కొట్టారన్నారు. 

ఆ ముఠాలోని తుషార్ అనే వ్యక్తి వయానాడ్ లో రాహుల్ గాంధీపై పోటీ చేశారని కేసీఆర్ తెలిపారు. ఆయనను అభ్యర్థిగా అమిత్ షా ప్రకటించారన్నారు. ఒక్కో వ్యక్తికి మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయన్నారు. తాము చెబుతున్న వీడియోలో ఉన్న వ్యక్తులు చాలా పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పారని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 8 రాష్ట్రాలు కుల్చామని.. త్వరలో  తెలంగాణ, ఢిల్లీ ,ఏపీ, రాజస్థాన్ తమ వశం అవుతాయని చెప్పినట్లు వీడియోలో ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూల్చుతామంటే ఊరుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో జరిగిన వీడియో  సంభాషణను కేసీఆర్ మీడియాా ముందు చూపించారు.  తుషార్ అనే వ్యక్తి కేంద్రమంత్రికి సన్నిహితుడు అని చెప్పారు. బీఎఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా పేర్లను బ్రోకర్లే చెప్పారన్నారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు. 

ఎమ్మెల్యేలను కొనడానికి అసలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టింది తామే అంటున్నారని...  మొన్న మహారాష్ట్ర సర్కార్ ను కూడా పడగొట్టామంటున్నారని చెప్పారు.  ఇంత దుర్మార్గం ఎక్కడైన ఉందా? అని ప్రశ్నించారు. ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని వాళ్లే చెబుతున్నారని..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేసీఆర్ అన్నారు.