స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించిన వ్యక్తి మహాత్ముడు

స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించిన వ్యక్తి మహాత్ముడు

ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శప్రాయుడని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం మహాత్మాగాంధీ 73వ వర్ధంతి సందర్భంగా కేసిఆర్ ఆయనకు నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ అహింస, సత్యాగ్రహదీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని ముఖ్యమంత్రి కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని సీఎం అన్నారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని మహాత్మాగాంధీ జీవితం చాటి చెప్తుందని సీఎం అన్నారు.

For More News..

యూపీలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి

లాడ్జీలో లవర్స్ సూసైడ్.. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులే

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ