2018లో జూపల్లి కృష్ణారావు అందుకే ఓడిపోయిండు: కేసీఆర్

2018లో జూపల్లి కృష్ణారావు అందుకే ఓడిపోయిండు: కేసీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ సీరియస్ గా క్లాస్ పీకారు.  నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని  వార్నింగ్ ఇచ్చారు.  చిలిపి పనులు చిలిపి వేశాలు మానుకోవాలని చెప్పారు. అభ్యర్థులు అహంకారాన్ని పక్కన పెట్టి ప్రతీ కార్యకర్తతో కలిసి పనిచేయాలని సూచించారు.  అలకలు పక్కన పెట్టాలని చెప్పారు.  గత ఎన్నికల్లో ఒకరిద్దరికి  వ్యక్తిత్వం మార్చుకోవాలని  చెప్పినా వినలేదన్నారు.  అహంకారంతో జూపల్లి కృష్ణారావు కార్యకర్తలను పట్టించుకోలేదని.. అందుకే ఆయన 2018 ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. 

రాజకీయాలన్న తర్వాత  మంచి చెడూ ఉటాయని..  అభ్యర్థులందరూ ప్రజల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.  ఇది ఎంతో ముఖ్యమైన ఘట్టమని.. అభ్యర్థులంతా సంస్కారవంతంగా ప్రవర్తించాలని చెప్పారు.  ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం 51 బీఫారమ్ లు రెడీ అయ్యాయి..మిగతావి రెడీ అవుతుతున్నాయన్నారు