మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళితబంధు

మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళితబంధు

మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళిలబంధు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బ్యాంకు నుంచి నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని ఆయన అన్నారు.  ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో ఈ పథకం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. దళితులందరికోసం ‘దళిత రక్షణ నిధి’ పేరుతో 4 వేల కోట్లు కేటాయించామన్నారు.