సూపర్స్టార్ రజినీకాంత్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో ఆయనను సీఎం కేసీఆర్ అభినందించారు. చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, అశేష ప్రజాదరణ పొందిన దక్షిణాది తమిళ ప్రముఖ నటుడు రజినీకాంత్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తంచేశారు. నటుడుగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజినీకాంత్కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సినీ హీరో రజినీకాంత్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.