తెలంగాణలో ఆదివారం 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఉద్యమ స్ఫూర్తి తో జనతా కర్ఫ్యూ పాటించాలని చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం జనత కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.
కరోనా వైరస్ సోకినట్టు తెలిసిన బాధితులకు ఇప్పటి వరకు ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహించే వీలుండగా.. నగరంలోని CCMB లో పరీక్షలు నిర్వహించాలని ప్రధానితో వీడియోకాన్ఫరెన్స్ లో కోరామన్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆ సెంటర్ లోనే పరీక్షలు నిర్వహించేందుకు అందుకు మోడీ ఒకే చెప్పారని.. తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆధికారులకు సూచించారని చెప్పారు.