పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు

పోతిరెడ్డి పాడు పనులు మొదలైన రోజు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్ మొదటి నుంచి మాట్లాడున్నా…తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు.. కేసీఆర్ తోనే మాట్లాడిన తర్వాతనే పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్ధ్యాన్ని పెంచుతూ జీవో ఇచ్చినట్లు AP మంత్రులు చెబుతున్నారన్నారు.

గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నుంచి ఏపీకి 44 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకెళ్లినప్పుడే ఆందోళన చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ENC  మురళీధర్ రావు 2011 లో రిటైర్మెంట్ అయ్యారు. అయినా ప్రస్తుతం కాంట్రక్టు ENC గా కొనసాగుతున్న ఆయన..వేల కోట్ల టెండర్లలో ఎలా పాల్గొంటాడని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులో 2TMCల నుంచి ఒక్క TMC కి ఎలా తగ్గిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీధర్ రావు పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే CM కేసీఆర్ ఆదేశాలతోనే మురళీధర్ రావు పని చేస్తున్నాడని అనుకోవాల్సి వస్తుందన్నారు.

గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే తమ్మిడి హెట్టిని వదిలిపెట్టి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కడుతున్నారని ఆరోపించారు ఉత్తమ్. లాక్ డౌన్ సమయంలో 21 వేల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇందులో 8% పర్సెంట్ కోసం ఈ టెండర్లు పిలిచారన్నారు. 2TMC ల కోసం ప్రజల పన్నుల సొమ్మును లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పోతిరెడ్డిపాడు పై ఎలాంటి పోరాటంకైనా సిద్ధమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..ఛలో పోతిరెడ్డిపాడు కు కూడా పిలుపు నిస్తామని తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు..ప్రధాని మోడీని కూడా కలుస్తామన్నారు ఉత్తమ్.