
తెలంగాణపై కేంద్రానికి ఎందుకీ ఈ వివక్ష అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై, బెంగళూరుకు మెట్రో ఇచ్చారు.. తాము మెట్రో,మూసీ,ఆర్ఆర్ఆర్ అడిగితే కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. తమ నివేదకలో ఏమైనా లోపాలు ఉన్నాయా?. ఏం పాపం చేశామో చెప్పాలని ప్రశ్నించారు రేవంత్.
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్.. రాష్ట్రానికి మోదీ ఏమిచ్చారో బీజేపీ నేతలు చెప్పాలి.మీకు 8 మంది ఎంపీ సీట్లు ఇచ్చారు. చిన్న చిన్న నగరాలు అద్భుతంగా మెట్రోను విస్తరించుకుంటున్నాయి.. మా నివేదకలో ఏమైనా లోపాలు ఉన్నాయా?. మేం ఏ పాపం చేశాం. రెండో స్థానంలో ఉన్న మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. 30 -35 సార్లు ఢిల్లీ వెళ్లి అందర్ని కలిశా.. రేపు అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. మళ్లీ విజ్ఞప్తి చేస్తాం.మూసీ, మెట్రో పూర్తయితే హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారబోతుంది.
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తప్పుడు ప్రచారం చేశారు. పెట్టుబడులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. కాలుష్యమే ఇపుడు యమపాశం అయ్యింది. ఫ్యూచర్ సిటీని గొప్పగా నిర్మిస్తాం.. నెట్ జీరో సిటీని నిర్మించాలనేదే మా ప్రయత్నం. నగర అభివృద్ధిపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. నగరంతో నాకు 40 ఏళ్ల అనుభందం ఉంది. రాజకీయ ముసుగులో అభివృద్ధిన అడ్డుకునే వారిని క్షమించాలా?
పీజేఆర్ కృషితోనే హైటెక్ సిటీ మంజూరైంది. నెదురుమల్లి జనార్థన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు దానిని మరో స్థాయికి తీసుకెళ్లారు. పేదలకు కష్టాలు వస్తే పీజేఆర్ ముందుండే వారు. పీజేఆర్ ఎప్పుడూ జనాల మధ్యన ఉండేవారు. హైదరాబాద్ లో 25 ఏళ్లు పీజీఆర్ శఖం నడిచింది. జంట నగరాల దాహాన్ని తీర్చిన వ్యక్తి . . పీజేఆర్ విగ్రహం పెట్టుకోవడానికి తమకు అభ్యంరం లేదు. స్థలాన్ని పరిశీలించుకోవాలి. 65 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడాలి. ముంబై,చెన్నై,ఢిల్లీ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. కాలుష్యమే ఇపుడు యమపాశం అయ్యింది.
రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తున్నాం. రాబోయే ఏడాదిలో హైదరాబాద్ లో డీజిల్ బస్సులు ఉండవ్. 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ .ఈ వాహనాలను ప్రోత్సహిస్తాం.
ఎన్ కన్వెన్షన్ కబ్జాను నాగార్జున అంగీకరించారు. కబ్జా చేసిన 2 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించి నిజమైన హీరో అనిపించుకున్నారు. హైదరాబాద్ లో అనేక చెరువులు,నాళాలు కబ్జాకు గురయ్యారు. హైడ్రాతో కబ్జాలకు ఉక్కపాదం మోపుతున్నాం. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. శేర్లింగంపల్లి 4 నియోజకవర్గాలుగా మారబోతుంది. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఉండటం సహజం..మీరందరినీ కాపాడే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుది. శేర్లింగంపల్లిలో ఉండే ప్రజలు ఏ సమస్య ఉన్నా శ్రీధర్ బాబుకు చెప్పండి అని రేవంత్ అన్నారు.