
కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడినవారికి పదవులు తప్పకుండా వస్తాయని.. పనిచేయకుంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని అన్నారు. త్వరలో కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయని, కార్యకర్తలను గెలిపించుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు సీఎం రేవంత్.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తం అని అన్నారు. 18 నెలల్లో రైతులకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేశామని అన్నారు సీఎం రేవంత్. కులగణన చేసి మోడీకి సవాల్ విసిరామని.. కేంద్రం మెడలు వంచి కులగణనకు ఓకే చెప్పించామని అన్నారు.
ALSO READ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాల్సిందే.. పీఏసీ మీటింగ్లో మీనాక్షి నటరాజన్
త్వరలో డెలిమిటేషన్ జరగబోతుందని.. సీట్లు పెరగనున్నాయని... మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయబోతున్నామని అన్నారు సీఎం రేవంత్. కష్టపడ్డా నేతలకు పార్టీ పదవులు ఇస్తుందనటానికి మహేష్ కుమార్ గౌడ్ నిదర్శనమని అన్నారు. పార్టీ బాధ్యత మోసినవారికే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని అన్నారు సీఎం రేవంత్. మన ప్రభుత్వాన్ని మరో ఏడాది పొడిగిస్తామని అంటున్నారని.. మరో నాలుగేండ్లు మన ప్రభుత్వమే ఉంటుందని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ బేరర్లదే అని అన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎంతోమంది పదవుల కోసం పోటీపడ్డారని అన్నారు. ఈ సమావేశంలో ఉన్న చాలామంది నేతలు కిందిస్థాయి నుంచి వచ్చినవారేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తన ఎదుగుదల సాధ్యమైందని అన్నారు సీఎం రేవంత్.