అందెశ్రీ మరణం..తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం రేవంత్

అందెశ్రీ మరణం..తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం రేవంత్

 ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయజయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని  గుర్తు చేశారు. 
 
అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని,  అందెశ్రీతో కలిసి  పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ... ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌.

అందెశ్రీ నవంబర్ 10న ఉదయం  హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా  7:25 గంటలకు ఆయన మృతి చెందినట్లు తెలిపారు.